అక్కినేని నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాడు.తీసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్లుగా నిలిచాయి.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టలనే కసితో తొలిప్రేమ వంటి డిసెంట్ హిట్ కొట్దిన వెంకీ అట్లూరితో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు.అక్కినేని నాగేశ్వరావు జయంతి సందర్భంగా చిత్రబృందం సినిమా టైటిల్ని రివీల్ చేస్తూ టీజర్ని విడుదల చేశారు చిత్ర యూనిట్.ఈ టీజర్ విడుదలైన కొద్దీ గంటల్లోనే అఖిల్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
త్యాగాలతో కూడుకున్న మజ్ను ప్రేమకథని అలాంటి టైటిల్ ని దిగజారుస్తూ ఓ ప్లే క్యారెక్టర్ పోషిస్తోన్న అఖిల్ సినిమాకు ‘మిస్టర్ మజ్ను’ అని పెట్టడమేంటని విమర్శలు చేస్తున్నారు. ఏఎన్నార్, నాగార్జునలు ఈ టైటిల్స్ తో సినిమాల్లో నటించిన భగ్న ప్రేమికులుగా చక్కటి నటన కనబరిచారు.అలాంటి టైటిల్ని అఖిల్ దుర్వినియోగం చేస్తున్నాడంటూ టీజర్ చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తుంది.సినిమాను త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నారు.