Sunday, May 19, 2024
- Advertisement -

గౌతమీ పుత్రా శాతకర్ణి గురించి ఆసక్తికర విషయం!

- Advertisement -

జాతీయ అవార్డు గ్రహీత డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న గౌతమీ పుత్రా శాతకర్ణి సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో స్పీడ్ గా సాగుతోంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ క్రిష్ తయారు చేసిన కథ ఈ సినిమా కి హై లైట్ గా చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ దగ్గర చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర వేసిన సెట్ లో భారీ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

మరొక షెడ్యూల్ లో కూడా ఇక్కడే షూటింగ్ జరగబోతోంది. రామ్ లక్ష్మణ్ నేతృత్వం లో ఒక భారీ ఓడ లో భారీ స్థాయి లో యుద్ధ సన్నివేశాలు తెరకి ఎక్కిస్తారు. మన వెబ్సైటు కి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథ దృష్ట్యా గౌతమీ పుత్రా ఎక్కువగా యుద్ధాల్లో పాల్గొంటాడు. ఈ సినిమా లో ఎక్కువగా యుద్ధ సన్నివేశాలు ఉండడం తో వాటికి సంబంధించియన్ వీఎఫ్ఎక్స్ పనులు అప్పుడే మొదలు పెట్టేసారు.

సాధారణంగా సినిమా పూర్తి అయిన తరవాత వచ్చే ఈ వీ ఎఫ్ ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళుతుంది కానీ ప్రొడక్షన్ లో ఉండగానే ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి.  ’బాహుబలి’ సినిమా కి సిజి వర్క్ అందించిన మకుట సంస్థ ఈ సినిమాకి పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బాలకృష్ణ రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారని తెలిసింది. శ్రేయ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ ఈ నెల 20 న ప్రారంభం అవుతుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -