హీరోయిన్ నిఖిషా పటేల్ తెలుగు వారికి పెద్దగా పరిచియం చేయల్సిన పని లేదు. ఎందుకంటే ఈభామ తెలుగులో పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్గా నటించింది. ‘కొమరం పులి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నికిషా పటేల్.కాని ఆ సినిమా ఫెయిల్ కావడంతో ఈ భామను ఎవరు పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్ కు షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తాజాగా ప్రభుదేవా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి వార్తల్లో నిలిచింది.ఇప్పుడు మరోసారి తన వాఖ్యలతో హల్ చల్ చేస్తుంది.తాజాగా ఈ బ్యూటీ తన బ్రేకప్ స్టోరీను చెప్పుకొచ్చింది.
సినిమాల్లోకి రాకముందు తను ఓ వ్యక్తిని ప్రేమించానని చెప్పుకొచ్చింది.పెద్దల్ని ఒప్పించి ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నట్లు కానీ మధ్యలోనే విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. దానికి కారణం సినిమాలని వెల్లడించారు. ఆమె ప్రేమించిన వ్యక్తికి నికిషా సినిమాల్లోకి రావడం ఇష్టం లేదట. నువ్వు సినిమాలలో నటిస్తే మన పెళ్లి విషయం మరచిపోమని చెప్పాడట. కాని నేను ప్రేమను వదులుకుని సినిమాలలో నటించానని తెలిపింది.ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి ఆలోచనలు లేనట్లు తెలిపారు.