సరికొత్త కథలతో ఆలస్యంగానైనా థియేటర్లకు వస్తూ మంచి సినిమాలు చేస్తున్న యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్. గత మూడు సినిమాలు విభిన్న కథలతో వచ్చి మంచి విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కిరిక్ పార్టీ’ని తెలుగు రీమేక్లో నటిస్తున్నాడుజ. ఎ.కె.ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. సంయుక్త హెగ్డే, సిమ్రాన్ పరీంజా హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే, మరో యువ దర్శకుడు చందూ మొండేటి సంభాషణలు అందిస్తున్నారు.
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే సినిమా ఫస్ట్లుక్ విడుదల చేశారు. ఇప్పుడు ప్రీ టీజర్ను విడుదల చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. దీనిలో భాగంగా సినిమా ప్రచార కార్యక్రమాల వేగం పెంచారు. జనవరి 22వ తేదీన తొలి పాటను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తవుతుండడంతో మిగతా పనులు పూర్తి చేసే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ సినిమాపై నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. దీని తర్వాత కూడా మరో రీమేక్లో నిఖిల్ నటించడానికి అంగీకరించాడని సమాచారం.