టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సారి తమిళ ఇండస్ట్రీలో వెలుగుతున్న ఓ హీరోని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు తెరలేపింది.నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలిలో కీలకమైన పొజిషన్లో ఉన్న ఓ హీరోను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చారు. దాంతో ఆమె ఇప్పుడు తమిళ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు. ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది.
నడిగర్ సంఘాన్ని రూల్ చేస్తున్న హీరో ని టార్గెట్ చేసారామె. సదరు హీరో నడిగర్ సంఘంతో పాటు తమిళ ప్రొడ్యూసర్స్ సంఘంలో కూడా కీలక పదవిలో ఉన్నాడని ఆమె క్లూ ఇచ్చింది.తమిళ నిర్మాతలందరూ నిన్ను నమ్మి నీకు ఓటు వేస్తే…. నువ్వు నీ అధికారాన్ని దుర్వినయోగం చేశావ్. నిర్మాతలను డబ్బు కోసం వేధించావు. ఇక నువ్వు నెం.1 బ్లాక్ మెయిలర్. నీ బండారం బయట పెట్టడానికి అన్నీ సెట్ చేశాం. కౌంట్ డౌన్ స్టార్ …జై జయలలితమ్మా అంటూ శ్రీరెడ్డి హెచ్చరించారు.