నందమూరి తారక రామారావు జీవిత కథను రెండు ,మూడు సినిమాలు తెరకెక్కిస్తున్నారు.వాటిలో ఒకటి రామారావు తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ పేరుతో ఆయన జీవిత కథను సినిమాగా తీస్తున్నా సంగతి తెలిసిందే.. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సినిమాలో మొదట ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి గురించి ప్రస్తావించడం లేదని అన్నారు.కాని ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది.
క్రిష్ ఈ బయోపిక్ లో లక్ష్మీపార్వతి ప్రస్తావన తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లక్ష్మీపార్వతి రోల్ లో సీనియర్ హీరోయిన్ ఆమనిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మధ్య చిత్రీకరించబోయే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం లక్ష్మీపార్వతి స్వయంగా రాసి వినిపించే కవిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.