Wednesday, May 15, 2024
- Advertisement -

జై జై బాల‌య్య అంటూ ర‌చ్చ చేసిన ఎన్టీఆర్‌

- Advertisement -

నంద‌మూరి కుటుంబంలో మొన్న‌టి వ‌ర‌కు విభేదాలు ఉన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. హ‌రికృష్ణ మ‌ర‌ణం ముందు వ‌ర‌కు బాల‌య్య కుటుంబానికి, హ‌రికృష్ణ కుటుంబానికి మ‌ధ్య స‌రైన సంబంధాలు లేవు. దీంతో బాల‌య్య తార‌క్‌ను కూడా దూరంగా పెడుతు వ‌చ్చాడు. ఎంత‌లా అంటే ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో నంద‌మూరి కుటుంబంలోని అంద‌రి హీరోల‌ని తీసుకున్న బాల‌య్య తారక్‌ను మాత్రం తీసుకోలేదు. కాని హ‌రికృష్ణ మ‌ర‌ణం త‌రువాత బాల‌య్య‌లో మార్పు వ‌చ్చింది. హ‌రికృష్ణ కుటుంబానికి అన్ని తానై చూసుకుంటున్నాడు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో ఈవెంట్‌కు స్వ‌యంగా బాల‌య్యే తార‌క్‌కు ఫోన్ చేసి మ‌రి పిలిచారు. ఇక ఎన్టీఆర్ కూడా బాబాయ్ మీద త‌నకున్నా ప్రేమ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చూపిస్తునే ఉన్నాడు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కొడుకు కార్తికేయ‌ పెళ్లి కోసం జైపుర్ వెళ్లాడు. అక్క‌డ టాలీవుడ్ హీరోలంద‌రితోను క‌లిసి ఎంజాయ్ చేస్తున్నాడు తార‌క్‌. ఆదివారం రాత్రి కార్తికేయ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. ఈ పెళ్లిలో తార‌క్‌ ర‌చ్చ ర‌చ్చ చేశాడు. జై బాల‌య్య అంటూ బాబాయ్‌పై ప్రేమను చాటుకున్నాడు తార‌క్‌.

రిసెప్ష‌న్‌లో తార‌క్ జై బాల‌య్య అంటూ తెగ హంగామా సృష్టించాడు. అక్క‌డే ప‌క్క‌న ఉన్న అఖిల్ కూడా జై జై బాల‌య్య అంటూ తార‌క్‌కు తోడుగా స్లోగ‌న్ ఇచ్చాడు. వీరిద్ద‌రితో పాటు ప‌క్క‌నే ఉన్న మ‌రికొంద‌రు జై బాల‌య్య అంటూ స్లోగ‌న్ ఇవ్వ‌డంతో ఒక్క‌సారిగా అక్క‌డ వాతవార‌ణం మారిపోయింది. తార‌క్ బిగ్గ‌ర‌గా జై జై బాల‌య్య అంటూ అరుస్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -