ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ మహనాయకుడు సినిమా నిన్న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి పార్ట్ కథానాయకుడుకులాగే ఈ సినిమాలో కూడా మ్యాటర్ లేదని ప్రేక్షకులు తేల్చేశారు. మొదటి పార్ట్ను ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించినదిగా కగా, రెండో మహనాయకుడు ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించినది తీశారు. అయితే రెండో పార్ట్లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును విలన్గా చూపించి ,చంద్రబాబు క్యారెక్టర్ను మంచిగా చూపించడంతో సినిమా ఎవ్వరికి నచ్చడం లేదు. అసలు ఈ సినిమా ఎన్టీఆర్ బయోపికా లేక చంద్రబాబు బయోపిక్ అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు.
దీంతో ఈ సినిమాను చూడటానికి ఎవ్వరికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ మీద చూపిస్తోంది.మహానాయకుడు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సినిమా మొదటి రోజున కలెక్షన్స్ ఎంత రాబట్టిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. అయితే తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ సినిమా కోటి రూపాయల షేర్ కూడా సాధించలేకపోయిందన్న టాక్ వినిపిస్తోంది. కథానాయకుడు భారీ నష్టాలను మిగిల్చింది. రెండో పార్ట్ మహనాయకుడుకి కూడా నష్టాలు తప్పేలా లేవు.