- Advertisement -
మహనటి సినిమా తరువాత సావిత్రి గురించి తెలుసుకోవాలని ఆసక్తి అభిమానులలో ఎక్కువుగా ఉంది.సోషల్ మీడియాలో ఆమె గురించి ఎక్కువుగా వార్తలు వస్తున్నాయి.అయితే సినిమాలో సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు సుశీల గురించి చూపించారు.ప్రస్తుతం ఆమె విజయవాడలో ఉంటుంది. తాజాగా ‘వనిత’ టీవీ వారు చేసిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
“జెమినీ గణేశన్ ను సావిత్రి వివాహం చేసుకోబోతోందనే విషయం మా అందరికీ ముందుగానే తెలిసిందని రామారావుగారు అక్కినేని నాగేశ్వరరావు గారు ,అంతా కూడా జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకోవద్దని ఎంతగానో చెప్పారు. చివరిగా ఆమె నన్ను అడిగింది .. జెమినీ గణేశన్ కి ఇంతకుముందే పెళ్లి అయింది .. పిల్లలు వున్నారు. అలాంటి ఆయనను పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని నేను చెప్పాను .. అయినా తాను వినిపించుకోలేదు” అంటూ చెప్పుకొచ్చారు.