Friday, May 17, 2024
- Advertisement -

ఆడియో వేడుకను పోస్ట్‌పోన్ చేస్తున్నారట!

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయం అవుతుంది నాగబాబు కుమార్తె నిహారిక. ఈ మెగా హీరోయిన్ మొదటిసారి గా నటిస్తున్న చిత్రం ఒకమనసు. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు నిహారికకు ఆమె పెదనాన్న చిరంజీవి సమస్యగా మారాడట. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు అయిపోవస్తుండగా….ఆడియో విడుదల వేడుకను ఈనెల 27 న జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

అయితే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న తోలి హీరోయిన్ సినిమా ఆడియో వేడుక అట్టహాసంగా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అందుకు మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు మెగా హీరోలను కూడా ఈ ఆడియో వేడుకకు ఆహ్వానించారు.  దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే వేదికపై కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కాని ఇప్పుడు ఈ వేడుకను పోస్ట్‌పోన్ చేస్తున్నారట… ఇందుకు కారణం మెగాస్టార్ చిరంజీవియే…మెగాస్టార్ చిరు తన 150వ చిత్రం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.

ఈ నెల 29 ఈ చిత్రం లాంచింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక మనసు ఆడియో వేడుకకు ఆయన వచ్చే అవకాశాలు లేవని, అందుకే ఆడియో వేడుకను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలో మంచి రోజు చూసుకొని మెగా హీరోలందరూ అటెండ్ అయ్యేలా ఆడియో రిలీజ్‌కు ఒక డేట్ ఖరారు చేసే పనిలో చిత్ర బృందం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -