అల్లరి నరేశ్ ఒకప్పుడు నిర్మాతలకు ఆశ దీపం. నిర్మాత పది రూపాయలు పెడితే ఆ పది రూపాయలతో రెండు, మూడు రూపాయలు ఎక్కువ వచ్చేలా నరేశ్ సినిమాలు ఉండేవి. అల్లరి నరేశ్తో సినిమాలు తెలుగు తెరపై బాగానే ఆడేవి. అయితే ఇటీవల కథలు బాగోకపోవడమో, లేదా కొత్త తరహా చిత్రాలు చేయకపోవడమేమో గానీ అల్లరి నరేశ్కు అచ్చి రావడం లేదు. చివరి సినిమా హిట్ ‘సుడిగాడు’తో నరేశ్ సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అవి ఆడలేదు.
ఇప్పుడు తనకు హిట్ ఇచ్చిన ‘సుడిగాడు’ టీమ్తోనే మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా జనవరిలో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘సుడిగాడు’ తీశారు. ‘సుడిగాడు’ సినిమాకు సంగీతం అందించిన శ్రీ వసంత్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అల్లరి నరేశ్ కొంత గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో రానున్నాడు.