తమిళ స్టార్ హీరో విశాల్కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.విశాల్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదలవుతుంది.ఇక విశాల్ నటించిన తాజా చిత్రం పందెం కోడి -2 దసరా కానుకగా ఈ రోజే(గురువారం) విడుదలైంది.తనకు కెరీర్లో సూపర్ హిట్ ఇచ్చిన పందెం కోడి సినిమాకు సీక్వెల్గా వస్తుంది పందెం కోడి-2.ఈ సినిమాకు కూడా లింగుసామినే దర్శకత్వం వహించాడు.కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పందెం కోడికి లాగే ఈ సినిమాలో కూడా విశాల్ రాయలసీమ కుర్రాడిలా కనిపించాడు.సినిమా మొత్తన్ని తన భూజల మీద మోశాడు విశాల్.ఇక సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా ప్రత్యేకతను ఇచ్చాడు దర్శకుడు.హీరోయిన్గా కీర్తి సురేష్ బాగా చేసింది.తన అల్లరితో థియోటర్లలో నవ్వులుల పుయించింది కీర్తి.విశాల్- కీర్తి సురేష్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి.ఇక పందెం కోడి- 2కి హైలెట్ అంటే మాత్రం వరలక్ష్మి క్యారెక్టర్ అనే చెప్పాలి.
ఒక్కనొక దశలో విశాల్నే డామినేట్ చేసింది వరలక్ష్మి.విలన్ రోల్లో వరలక్ష్మి అద్భుత నటన కనపరించిందనే చెప్పాలి.ఫస్టాఫ్ అంత విశాల్- కీర్తి సురేష్ల ప్రేమ సన్నివేశాలతో నింపేసిన దర్శకుడు ఇంటర్వెల్ నుంచి సినిమా మాస్,ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కించాడు.నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఈ సినిమాకు హీరో విశాల్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన సంగతి తెలిసిందే.అభిమాన్యుడు సినిమాతో హిట్ కొట్టిన విశాల్కు, పందెం కోడి- 2తో మరో హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు.సినిమా పూర్తి రివ్యూ మరి కొద్దిసేపట్లో మీ ముందు ఉంటుంది.