Thursday, May 9, 2024
- Advertisement -

ర‌వితేజ సినిమాకు గెస్ట్‌గా ప‌వ‌న్ కల్యాణ్‌

- Advertisement -

జ‌న‌సేన అధినేత ,ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల‌కూ దూరంగా ఉన్నా సీనీ ఇండ‌స్ట్రీకి మాత్రం దురంగా లేర‌నే చెప్పాలి.ప‌వ‌న్ అజ్ఞాత‌వాసి త‌రువాత సినిమా మానేసి రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారు ప‌వ‌న్‌.అయిన ఏదో ర‌కంగా సినిమా వాళ్ల‌ను క‌లుస్తునే ఉన్నారు. నితిన్ ఛ‌ల్ మోహ‌న్ రంగా సినిమా ప్రీ-రీలిజ్ ఈవెంట్‌కు వ‌చ్చారు ప‌వ‌న్‌.ఈ సినిమాకు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు.త‌రువాత రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమా స‌క్సెస్ మీట్‌కు హ‌జ‌రై మెగా ఫ్యామీలి అంత ఒక‌టే అనే చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడు మ‌రో ఆడియో ఫంక్ష‌న్‌కు రావ‌డానికి రెడీ అవుతున్నాడు ప‌వ‌న్.

ర‌వితేజ హీరోగా క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నేల టిక్కెట్ సినిమా తెరకెక్కుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు రెడీ అవుతుంది.ఇప్పుడు ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తున్నార‌ని స్వ‌యంగా చిత్ర ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ త‌న ట్వీట్ట‌ర్ ద్వారా తెలియజేశాడు.ఈ నెల 10వ తేదీన ఆడియో ఫంక్షన్ ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళ‌విక శ‌ర్మ న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -