యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమాను దసరాకు కానుకగా ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ రోజు జరగనున్న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా జనసేన,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వస్తున్నాడని సమాచారం.త్రివిక్రమ్ పవన్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.అరవింద సమేత సినిమా ఒపినింగ్ అప్పుడు కూడా పవన్ వచ్చి క్లాప్ కొట్టాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు రావలని త్రివిక్రమ్ కోరగా ,వెంటనే పవన్ వస్తానని మాటచ్చినట్లు సమాచారం.ఇదే కనుక నిజం అయితే ఇటు మెగా అభిమానులు,అటు నందమూరి అభిమానులకు శుభవార్తే అని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో కొత్త రకమైన ఫ్యాక్షన్ కథను త్రివిక్రమ్ ప్రేక్షకులకి చూపించనన్నాడని తెలుస్తుంది.రాయల సీమలో ఫ్యాక్షన్ కారణంగా భర్తలను .. పిల్లలను .. అన్నదమ్ములను కోల్పోయిన స్త్రీల పరిస్థితులకి సంబంధించిన కోణంలో ఈ కథ కొనసాగుతుందట. వాళ్ల ఎమోషన్స్ చూసిన కథానాయకుడు ఎలా స్పందిస్తాడు? ఏం చేస్తాడు అనేది కథతో సినిమాను తెరకెక్కించారట.సినిమాలో మంచి ఎమోషన్ ఉండటంతో అరవింద సమేత హిట్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.ఎన్టీఆర్ సరసన హీరోయిన్లుగా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు నటిస్తున్నారు.అజ్ఞాతవాసితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న త్రివిక్రమ్ ఈ సినిమాతో తనేంటో నిరుపించుకోవాలని భావిస్తున్నాడు.వరుస హిట్ల మీద ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా కూడా మంచి నమ్మకంతో ఉన్నాడు.