హీరోలకి ఎప్పుడైన అభిమానులే బలం.హీరోలు అభిమానులను దృష్టిలో ఉంచుకోనే సినిమాలు చేస్తారు.ఒక సినిమా హిట్ అవడానికి అభిమానులు మద్దతు తప్పనిసరిగా ఉండాలి.ఇక అభిమానులు విషయానికి వస్తే ఒక హీరో అభిమానులు మరో హీరోని ట్రోల్స్ చేయడం సర్వసాధారణం.ఫ్యాన్స్ తమ హీరో గొప్ప అంటే ,మా గొప్ప అంటూ కొట్టుకునే స్థాయి నుంచి చంపుకునే స్థాయికి వెళ్లారు.గతంలో ఎన్టీఆర్ అభిమానిని పవన్ ఫ్యాన్ ఒకరు పశ్చిమ గోదావరిలో చంపడం కలకలం రేపింది.అప్పటి నుంచి మన హీరోలు తమ అభిమానులను అదుపులో ఉంచుతూ వస్తున్నారు.మహేశ్ బాబు భరత్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ…మేం మేం బాగానే ఉంటాం మీరే బాగుపడాలి అని ఫ్యాన్స్ ఉద్దేశించి మాట్లాడింది మనకు గుర్తు ఉండే ఉంటుంది.
అప్పటి నుంచి హీరోల అభిమానులలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.ఒక హీరో సినిమా విడుదల అవుతుంటే మరో హీరో అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.ఏ హీరో సినిమా ట్రైలర్ విడుదల అయిన మరో హీరో ఫ్యాన్ అభినందనలు తెలుపడం మనం చూస్తేనే ఉన్నాం.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.నిన్న(మంగళవారం) ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతు … చనిపోయిన తన తండ్రి హరికృష్ణని గుర్తు చేసుకుని స్టేజీ మీదే కన్నీరు పెట్టుకున్నారు.ఇది అక్కడ ఉన్నవారితో పాటు టీవీలో చూస్తున్నవారికి కూడా ఎందో బాధ కలిగిచింది. ఎన్టీఆర్ ఇలా బాధపడటాన్ని చూసిన జనసేన అధినేత ,నటుడు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్కు మద్దతుగా నిలిచారు.మీకు మేము ఉన్నాము అంటూ ధైర్యం ఇస్తున్నారు.ఇలా ఒక హీరో అభిమానులు మరో హీరోకి అండగా నిలవ్వడాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.