- Advertisement -
టాలీవుడ్ హీరోలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా దూసుకుపోతున్నారో అదేవిధాంగా మోస్ట్ డిజైరబుల్ లిస్ట్లో దూసుకుపోతున్నారు.ప్రముఖ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ లిస్ట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు స్థానం దక్కించుకున్నారు. 2017 ఏడాదికి గానూ విడుదల చేసిన జాబితాలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తొలి స్థానంలో నిలవగా.. ప్రభాస్ రెండో ప్లేస్లో నిలిచారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 6వ స్థానంలో నిలవగా.. దగ్గుబాటి రానా ఏడో స్థానం దక్కించుకున్నారు. మళయాళం యువ హీరో దుల్కర్ సల్మాన్ 9వ స్థానంలో నిలిచారు. పాపులారిటీ, క్రేజ్ను ఆధారంగా చేసుకుని మొత్తం 50 మంది పేర్లతో ది టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ పేరిట టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ జాబితాను విడుదల చేస్తుంటుంది.