- Advertisement -
బాహుబలి ప్రభాస్కు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు రెబల్స్టార్ ప్రభాస్. మా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వస్తున్న వదంతుల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
దుబాయ్ లో ‘సాహో’ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. మా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న విషయాన్ని కరణ్ జోహార్ తనకు ఫోన్ చేసి చెప్పారని అన్నారు.
ఈ వదంతులు అబద్ధమని, వాటిని నమ్మొద్దని చెప్పారు. కాగా, బాలీవుడ్ కు ప్రభాస్ ను పరిచయం చేయాలని కరణ్ జోహార్ ప్రయత్నించారని, అందుకు, ప్రభాస్ అంగీకరించలేదనే వదంతులు ఇన్నాళ్లూ హల్ చల్ చేశాయి. ప్రభాస్ చేసిన తాజా ప్రకటనతో ఈ వదంతులకు చెక్ పడింది.