రాధేశ్యామ్ సినిమా బాలేదంటూ ప్రభాస్ ఫ్యాన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ చిత్రంపై మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ప్రేక్షకులు బాగుందంటుంటే.. ఇంకొందరు మాత్రం అంత బాలేదంటున్నారు. సినిమాను సినిమాను చూడాలే కాని వ్యక్తిగతంగా తీసుకోవడం మంచిది కాదు. కానీ కర్నూలు తిలక్ నగర్లో ఉండే రవితేజ అనే కుర్రాడు మాత్రం సినిమా బాలేదంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.
సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చిందనే విషయాన్ని భరించలేక ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై ప్రభాస్ స్పందిస్తే బాగుంటుందని పలువురు అభిమానులు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన అభిమాని తీసుకున్న ఈ నిర్ణయంపై హీరో ప్రభాస్ దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్ త్వరలోనే దీనిపై స్పందించనున్నట్లు చెబుతున్నారు.
సంపాదించే కొడుకు ఉరేసుకుని చనిపోవడంతో రవితేజ కుటుంబం రోడ్డున పడింది. కొడుకుపోయిన దుఃఖంలో ఉన్న అతడి తల్లిదండ్రులకు ఆర్థికసాయం అందించి వారిని ఆదుకోవాలని ప్రభాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా తన అభిమానుల కుటుంబాలకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ ప్రభాస్ స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎంతో సున్నిత మనస్కుడైన ప్రభాస్ ..తాజాగా అభిమాని ఆత్మహత్యతో కలిత చెందినట్లు చెబుతున్నారు.