Tuesday, April 30, 2024
- Advertisement -

ఇటలీ వీధుల్లో ప్రభాస్ కొత్త ఫొటోలు.

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ ఫారెన్ లో జరుగుతుంది.. కరోనా కారణంగా ఇప్పటివరకు ఈ సినిమా కదల్లేదు.. దాంతో ఆటోమేటిక్ గా సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ ఐయ్యింది. అయితే ప్రభుత్వం సడలింపులు నేపథ్యంలో తిరిగి షూటింగ్ లు ప్రారంభించారు.. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ విదేశాల్లో ఉండడంతో ఇప్పటికే వారు అక్కడికి చేరుకొని పద్నాలుగు రోజుల క్వారంటైన్ లో వుండి షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టనున్నారు.

ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, పూజ హెగ్డే కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇటలీలో నెల రోజుల జరిగిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తవడంతో ఇటీవల ఈ సినిమా యూనిట్ భారత్ కు వచ్చింది. తాజాగా, ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనపడుతున్నాయి. ఇటలీలో షూటింగ్ సమయంలో ఆయన ఈ ఫొటోలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రభాకరన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అభిమానులను అలరించాయి. భారీ బడ్జెట్‌తో యూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి గత నెల 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదలచేశారు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ప్రభాస్ వదిలేసిన పది సినిమాలు ఇవే..!

౩౦౦కోట్ల బడ్జెట్ లో సంగం ప్రభాస్ కే, అమితాబ్, దీపికాకే..!

ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇంత ప్లాన్ చేస్తున్నాడా….?

బాలీవుడ్ స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్న ప్రభాస్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -