యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్లో బిజి బిజిగా ఉన్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దుబాయ్లో జరుగుతుంది.. 50 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు, చేజ్ సీన్లు చిత్రీకరించనున్నారు. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అబుదాబిలో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అబుదాబిలో ఉన్న ప్రభాస్ అక్కడి రాజకుటుంబీకులతో సమావేశమయ్యారు.
రాయల్ ఫ్యామిలీకి చెందిన మహిళతో ప్రభాస్ సమావేశానికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రభాస్తో పాటు ఆయన సోదరుడు, యూవీ క్రియేషన్స్ నిర్మాత ప్రమోద్ కూడా రాయల్ ఫ్యామిలీని కలిసిన వారిలో ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.