- Advertisement -
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మాతగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయగా యూ ట్యూబ్లో ట్రెండింగ్గా మారింది. విడుదలైన 12 గంటల్లోనే 13 మిలియన్ వ్యూస్ను రాబట్టగా మిలియన్ మంది లైక్ చేశారు.
యాక్షన్ ప్యాక్డ్, థ్రిల్లింగ్, మాస్ అంశాల కలయికగా ఉన్న ట్రైలర్ అందరికి ఆకట్టుకుంటోంది. పక్కా మాస్ మూవీగా నీల్ ఈ సినిమాను తెరకెక్కించగా పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీ హాసన్, జగపతి బాబు, బాబీ సింహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్మస్ కానుగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.