Monday, May 20, 2024
- Advertisement -

ప్రియావారియ‌ర్‌కోసం ఎగ‌బ‌డుతున్న కంపెనీలు…

- Advertisement -

సోషల్‌ మీడియా ఎప్పుడు ఎవర్ని సెలబ్రిటీని చేస్తుందో ఊహించలేం! త్రిస్సూర్‌లో బీకాం ఫస్టియర్‌ చదువుతున్న మలయాళీ అమ్మాయి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఇప్పుడు లేటెస్ట్‌ సెలబ్రిటీ! ఒకే ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయారు .ఆమె నటించిన తొలి చిత్రం ‘ఒరు అదార్‌ ‌ లవ్‌’ టీజర్‌లోని అభినయం దేశవ్యాప్తంగా ఆమెకు ఎనలేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది.

ఫాలోయర్లలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్‌నే మించిపోయింది ఈ కేరళ నటి. ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థ యజమాని జూకర్‌బర్గ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్లు 4 మిలియన్లు (40 లక్షల మంది) ఉండగా, ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే సెలబ్రిటీగా మారిన ప్రియా ప్రకాశ్ కు 4.5 మిలియన్లు (45 లక్షల మంది) ఫాలోయర్ల‌ను సంపాదించుకుంది. ఇదే ఆమె పాలిట వ‌రంగా మారింది.

తాజాగా ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు కొన్ని కంపెనీలు సైతం క్యూ గడుతున్నట్లు సమాచారం. తమ ఉత్పత్తులకు ప్రచారం చేసిపెట్టాలని, ఇందుకు భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పుతామని ఆమెకు ఆఫర్ ఇస్తున్నాయట. ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల్లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు పెడితే రూ.8 లక్షల వరకు ఇస్తామంటూ ఆమెకు పలు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. కాగా, ప్రియా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అతి తక్కువ సమయంలోనే 5.8 మిలియన్లను దాటేసింది.

తొలి చిత్రం ఇంకా విడుదల కాకుండానే ప్రియా ప్రకాశ్‌కు ఈ స్థాయిలో వస్తున్న ఆఫర్స్‌పై సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ లాంటి వారికి సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉందని.. ఆమె ఒక్కో పోస్టుకి అధిక మొత్తంలో వసూలు చేస్తారని సమాచారం. తొలి సినిమా హిట్ అయితే ఇంకెంత క్రేజ్ పెరుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -