- Advertisement -
‘థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ… ‘ ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయిన కామెడీ నటుడు పృథ్వీ. డైలాగ్ ఏదైనా హాస్యం పండిచడంలో మాత్రం పండితుడు గా మారిపోయాడు. లౌక్యం సినిమాలో బాలకృష్ణ స్పూఫ్ తో అలరించిన పృథ్వీ…
తాజాగా విడుదల అయిన బెంగాల్ టైగర్ చిత్రంలోనూ స్పూఫ్ లతో అలరించాడు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి … ప్రేక్షకుల నుంచి తనతో పాటు చిత్రానికి మంచి మార్కులు వేయించాడు.
మొత్తానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎమ్మెస్ నారాయణ లేని లోటును పృథ్వీ పూరిస్తూ వస్తున్నాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.