భైరవగీత, మనుచరిత్ర, పుష్ప వంటి సినిమాల్లో నటించిన కన్నడ నటుడు ధనుంజయ్ తాజాగా తెలుగులో బడవ రాస్కెల్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అమృత అయ్యంగార్ నాయిక. కన్నడలో విడుదలైన ఈ సినిమా యాభైరోజులుపైగా ఆడుతోంది. తెలుగులో ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ నెల 18న విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. శంకర్ గురు దర్శకత్వం వహించారు. వాసుకీ వైభవ్ సంగీతం సమకూర్చారు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక మంగళవారం రాత్రి దస్పల్లా హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా రామ్గోపాల్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్బంగా రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ, యాంకర్ అన్నట్లు నేను తోపు, రౌడీ, గూండా కాదు. నేను రాస్కెల్ను కూడా. ఈ సినిమా టైటిల్ బడవ రాస్కెల్ అంటే ఏమిటని ధనుంజయ్ను అడిగాను. కన్నడలో పూర్ అని అర్థమని చెప్పాడు.
ధనుంజయ్ తగరు సినిమా చూశాను. ఆ సినిమా సక్సెస్కు తను కూడా ఓ పిల్లర్. కానీ స్టార్ ఇమేజ్ వున్న చిత్రంలో ఎవరు ఎంత బాగా చేసినా క్రెడిట్ హీరోకే దక్కుతుంది. ఆ తర్వాత నేను భైరవగీత ధనుంజయ్తో చేశాను. నాతో ఓ మాట జావేద్ అక్తర్ చెబుతుండేవారు. మన విలువను అవతలివాడు గుర్తించడు. మనమే గుర్తించుకోవాలని అని.. అది ధనుంజయ్ నిజం చేశాడు. అదే అతనికి డబుల్ సక్సెస్. ధనుంజయ్ తగరు నుంచి పుష్ప వరకు తన పాత్రలలో వేరియేషన్ చూపించాడు. అమృత ఫెంటాస్టిక్గా వుంది. ట్రైలర్ బాగుంది. తారగారు పవర్ఫుల్ వాయిస్. మంచి నటి. ఆమెను తదుపరి సినిమాలో యాక్ట్ చేయిస్తాను అని తెలిపారు.
భారీ ఆఫర్ దక్కించుకున్న శ్రీలీల