Saturday, May 11, 2024
- Advertisement -

తండ్రితో తీసిన దర్శకుడు… కూతురితోను చేయబోతున్నాడట..!

- Advertisement -

ఒకవైపు హీరోగా మాత్రమే కాక మరొక వైపు స్క్రిప్ట్ రైటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్న అడవి శేష్ ఈ మధ్యనే ‘గూడచారి’ అనే సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే అడివి శేష్ హీరోగా బాలీవుడ్ సినిమా ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ గతేడాది సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. వి.వి వినాయక శిష్యుడైన వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతం పూర్తయింది. అయితే గత కొంతకాలంగా వెంకట్ మరియు అడివి శేష్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఈ నేపథ్యంలో వెంకట్ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో శివాని తల్లిదండ్రులు జీవిత మరియు రాజశేఖర్ ఆ సినిమాను నిర్మాత నుంచి కొనుక్కొని మిగతా సినిమాను కూడా పూర్తిచేసి విడుదల చేయాలని అనుకున్నారు. దీనికోసం రాజశేఖర్ ‘కల్కి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ వర్మ ను దర్శకుడిగా రంగంలోకి దింపాలని అనుకున్నారు. కానీ కోపంతో ఉన్న వెంకటరెడ్డి కోర్టును ఆశ్రయించాడు. అంటే కోర్టు ఆర్డర్ బయటకు వచ్చేదాకా ఈ సినిమా కోసం దర్శకుడిని తీసుకోవడానికి లేదు. ప్రస్తుతం సినిమా ఎప్పటికి పూర్తవుతుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -