- Advertisement -
నిన్న(గురువారం) సినీ రచయిత రాజసింహ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.అయితే దీనిపై రాజసింహ స్పందించాడు.జరిగింది ఒకటైతే, మీడియాలో మరొకటి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.తనకు మధుమేహం ఉందనిషుగర్ లెవెల్స్ పెరిగిపోయాయని, దీంతో స్పృహ తప్పి పడిపోయానని చెప్పాడు.
ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపాడు. . మరో రెండు, మూడు రోజుల్లో హైదరాబాదుకు వస్తానని తెలిపారు రాజసింహ. ‘ఒక్క అమ్మాయి తప్ప’ అనే సినిమాకు రాజసింహ దర్శకత్వం కూడా వహించాడు. ఆ సినిమా పరాజయంపాలవడంతో, ఆ తర్వాత ఆయనకు అవకాశాలు రాలేదు. దీంతో ఆయన ఆత్మహత్యాయత్నం చేశాడనే వార్తలు వచ్చాయి.