సూపర్స్టార్ రజినీకాంత్ సినిమా విడుదల అవుతుందంటే చాలు ఇండియా మొత్తం రజినీ ఫివర్తో ఊగిపోతుంది.అయితే రజినీకాంత్ నటించిన గత రెండు సినిమాలు సరైన విజయాలు సాధించలేదు.రోబో తరువాత రజినీకి హిట్ లేదు.దీంతో రజినీ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.ఇక రోబోకు సీక్వెల్గా తెరకెక్కుతున్న 2.0 సినిమాపై తలైవా అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన టీజర్,ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.ఇక సినిమా మరో నాలుగు రోజులలో విడుదల కానుంది.సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూఏఈ సర్టిఫికెట్ వచ్చింది.
ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను చూసిన సెన్సార్…ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుందని చెబుతున్నారు. రజినీకాంత్ చిట్టి పాత్ర, అక్షయ్ కుమార్ క్రోమ్యాన్ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచడం ఖాయమని అంటున్నారు. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని.. క్లైమాక్స్ ఎపిసోడ్ కథకు పూర్తి న్యాయం చేసే విధంగా ఉంటుందని టాక్. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హక్కులను రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రూ.80 కోట్లకి అమ్మారు. ఆ స్థాయిలో సినిమా వసూళ్లు సాధించాలంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిందే!