సూపర్స్టార్ రజనీకాంత్ ఏం చేసిన సంచలనమే.65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకి ధీటుగా సినిమాలు చేస్తున్నాడు రజినీ.రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు సృష్టిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. వస్తాను అని ప్రకటించిన రజనీ మరికొంత సమయం తీసుకునేలా ఉన్నాడు. ఇంతలో వరస పెట్టి సినిమాలతో రాబోతున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ సినిమా విడుదలకు సన్నద్ధం అవుతోంది.
అలాగే శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘2.0’ కూడా త్వరలోనే విడుదల కానుంది. రజనీ-కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రజనీ కెరీర్లో ఇది 165వ చిత్రం. అయితే ఈ సినిమాకు రజనీ రూ.65 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇదే కనుక నిజం అయితే ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా రికార్డు సృష్టిస్తాడు.