తలైవా రజినీకాంత్ స్పీడ్ పెంచాడు. వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. కాలా, కబాలి, రోబో 2.0 ఇలా వరుసగా సినిమాలు చేస్తు అభిమానులకు జోష్ పంచుతున్నాడు . రజనీ కొత్త చిత్రంపేటా. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. కథ ప్రకారం సినిమాలో రజినీకాంత్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.
అందులో ఒకటి హాస్టల్ వార్డెన్ పాత్ర అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ట్రైలర్ లో ఒక సన్నివేశంలో కుర్ర హీరోయిన్ మేఘాఆకాష్ కూడా కనిపించింది. బాబీ సింహా, నవజుద్ధీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతిల పాత్రలను వైవిధ్యంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్రైలర్ను కేవలం తమిళంతో మాత్రమే విడుదల చేశారు. తెలుగులో కూడా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ సరసన మొదటిసారి సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కనిపించనున్నారు.సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
- దిగొచ్చిన దీదీ..కూటమి సమావేశానికి!
- 30 ఏళ్లకే గుండెపోటు..కారణాలు & జాగ్రత్తలు!
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!
- వైసీపీ నేతలే టార్గెట్గా అక్రమకేసులు!
