తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 2.ఓ.భారీ బడ్జెట్తో తెరకెక్కితున్న ఈ సినిమా,రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటునే ఉంది.ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన టీజర్ ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు.
ఈ సినిమాలో విలన్గా చేస్తున్న అక్షయ్ కుమార్ తాజా చిత్రం ‘గోల్డ్’ ఈ నెల 15వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.దేశ వ్యాప్తంగా ‘గోల్డ్’ సినిమాతో పాటు ‘2.ఓ’ టీజర్ కూడా ప్రదర్శితం కానుంది.నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.రజనీ నటించిన గత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ఈ సినిమా అయిర హిట్ అవుతుందని రజనీ అభిమానులు ఆశిస్తున్నారు.సినిమాలో హీరోయిన్గా ఎమీ జాక్సన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.