గత ఏడాది వరకు బిజీ బిజీ షెడ్యూల్ తో గడిపిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అక్కడ అవకాశాలు లేక తెలుగు తెరకు పరిచియమైంది రకుల్.ఇక్కడ వరుస సక్సెస్ చూసిన రకుల్ వరుస పెట్టి సినిమాలు చేస్తు అగ్ర హీరోలందరితో పని చేసింది. తెలుగులొ అవకాశాలు తగ్గే సరికి మళ్లీ బాలీవుడ్ బాట పట్టింది.అక్కడ అయ్యారే అనే సినిమా చేసింది.అక్కడికి వెళ్లిన తెలుగు సినిమాపై కామెంట్స్ చేసింది.అక్కడ వారు గ్లామర్కు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తారని,మంచి రోల్స్ హీరోయిన్లకు రావని చెప్పుకొచ్చింది.తీరా చూస్తే హిందిలో చేసిన అయ్యారే సినిమా డిజాస్టర్గా నిలిచింది.హింది సినిమాలలో అవకాశం కోసం హాట్ హాట్గా ఫోటోషుట్లు చేసింది.కాని అవకాశాలు మాత్రం రాలేదు.తనుకు తెలుగు సినిమాలే కరెక్టు అనుకుని తెలుగులో పైరవీలు మొదలుపెట్టింది.
గత ఏడాది మొదట్లో రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాతో రకుల్ చివరి హిట్ అందుకుంది. నాగ చైతన్య తో అమ్మడి కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్ అవ్వడంతో సినిమాకి మంచి టాక్ వచ్చింది. నాగ చైతన్య కూడా వరుస డిజాస్టర్స్ తరువాత ఆ సినిమాతో హిట్ ను చూశాడు. ఈ సినిమా తరువాత రకుల్ కి గాని చైతు కి గాని ఒక్క హిట్ అందలేదు. దీంతో వీరిద్దరిని కలిపి సినిమా ప్లాన్ చేస్తుంది ఓ యంగ్ లేడి డైరక్టర్.. ఆమె ఎవరో కాదు. కృష్ణవంశీ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన సౌజన్య. సింపుల్ లవ్ స్టొరీ లైన్ తో స్క్రీన్ ప్లే ను బేస్ చేసుకొని తీయబోయే ఈ సినిమా కథ చాలా బావుంటుందట. నాగ చైతన్య సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేశాడని సమాచారం. ఇక రకుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మొత్తనికి రకుల్కి తెలుగు ఇండస్ట్రీనే దిక్కు అయ్యింది.