టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ ,ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది.ఎన్టీయర్ బయపిక్లో శ్రీదేవి రోల్ తప్ప అమ్మడి చేతిలో మరో సినిమా లేదు.అయితే ఇదే సమయంలో తమిళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తు బిజీగా ఉంది.ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ సినిమాకు నో చెప్పిందట రకుల్.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను ఓ యాక్షన్ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.
దేవిశ్రీప్రసాద్, బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న ఈ ఐటెం సాంగ్ లో రకుల్ తో స్టెప్పులు వేయించాలని ప్లాన్ చేశారు.కానీ దీనికి ఆమె అంగీకరించలేదట. తెలుగులో పెద్దగా అవకాశాలు లేనప్పటికీ బిజీగా ఉన్నాను.. ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ చేయలేను అంటూ తేల్చి చెప్పిందట. దీంతో ఐటెం సాంగ్ చేయలేనంత బిజీగా రకుల్ ఏంలేదని సినీ వర్గాలు అంటున్నాయి. ఐటెం సాంగ్ లో నటించడం ఇష్టం లేని కారణంగానే ఆమె రిజెక్ట్ చేసిందని టాక్.దీంతో మరో భామతో సాంగ్ను చేయించాడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి.గతంలో రామ్ చరణ్తో రెండు సినిమాలు చేసింది రకుల్.బ్రూస్లీ,ధృవ సినిమాలలో హీరోయిన్గా నటించింది రకుల్.