నందమూరి హీరో బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి అందరికి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి. సింహా,లెజెండ్ సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ఈ రెండు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. ముచ్చటగా మూడో సినిమా వీరి కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుందని తెలుస్తోంది. బాలయ్యతో కలిసి రకుల్ ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ మొదటి పార్ట్ కథానాయకుడులో కనిపించింది. ఈ సినిమాలో శ్రీదేవిగా ఓ సాంగ్లో కనిపించింది. ఇప్పుడు ఏకంగా బాలయ్యతోనే హీరోయిన్గా నటించే ఛాన్స్ రకుల్కు వచ్చినట్లు సమాచారం.
అయితే ఈ విషయంలో సినిమా యూనిట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్పై దృష్టి పెట్టారు. కథానాయకుడు ఫ్లాప్ కావడంతో రెండో పార్ట్ మహనాయకుడు సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు బాలయ్య. ఇక బోయపాటి శ్రీను కూడా ఇటీవలే వినయ విధేయ రామ వంటి ఫ్లాప్ సినిమాను తెరకెక్కించి తీవ్ర విమర్శలను ఫేస్ చేశాడు. మరి ఇలా ఫ్లాప్లలో ఉన్న వారందరు ఈ సినిమాకు పని చేయడం విశేషం. మరి ఈ సినిమా అయిన వీరందరికి హిట్ ఇస్తుందేమో చూడాలి.