Monday, April 29, 2024
- Advertisement -

మైసూర్‌లో రామ్, శ్రీలీల..

- Advertisement -

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, లేటెస్ట్ సెన్సేషనల్ నటి శ్రీలీల తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం యొక్క రాబోయే షెడ్యూల్ కోసం ఇద్దరూ మైసూర్‌ కు చెరుకున్నారు. మైసూర్ విమానాశ్రయంలో రామ్‌తో కలిసి ఉన్న పోటోను శ్రీ లీల సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కొత్త ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

బోయపాటి రాపో సినిమా దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం చిత్రబృందం మైసూర్ లో ల్యాండ్ అయ్యింది. ఈ షెడ్యూల్ దాదాపు 2 వారాలు ఉంటుంది. విడుదలను ప్రీ పోన్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -