సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం “రంగస్థలం”ఏ విధంగా నెటిజన్లను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. అప్పటివరకు క్లాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ ఈ చిత్రం ద్వారా తనలో ఉన్న మాస్ యాంగిల్ బయటపెట్టాడు. ఇకపోతే ఈ సినిమాలో రంగమ్మత్త పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు ఈ పాత్ర ఎంతో కీలకమని చెప్పవచ్చు.
రంగమ్మత్త పాత్రలో సందడి చేసిన అనసూయ ఈ సినిమా తర్వాత ఆమె రంగమ్మత్తగా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు వరుస అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంగమ్మత్త ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.
Also read:ఆ హీరోయిన్ నిర్ణయం కారణంగా ప్యాకప్ చెప్పిన నాని..!
సినిమా షూటింగ్ లో భోజన సమయానికి చేపలు కూర సిద్ధం చేసి ఉంచారు. అయితే అనసూయ చేపల కూర తినకపోవడంతో చెర్రీ అప్పటికప్పుడు తన చెఫ్ని పిలిపించి తనకోసం పన్నీర్ కూర చేయించారు. రామ్ చరణ్ కు ఆ విధంగా చేయించాల్సిన అవసరం ఏమాత్రం లేకపోయినా, తన కోసం ప్రత్యేకంగా తన చెఫ్తో కూర చేయించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఆ విషయం తను ఎప్పటికీ మర్చిపోనని, ఈ సందర్భంగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
Also read:అలాంటివాటి జోలికి ఇక పోనంటున్న యాంకర్ రష్మీ.. కారణం?