ఇప్పటి వరకు ఈ సంవత్సరం వచ్చిన సినిమాలలో రంగస్థలం,భరత్ అను నేను సినిమాలు పెద్ద హిట్స్.ఈ విషయంలో ఎవరికి అనుమానం లేదు.రెండు సినిమాలు 200 కోట్ల క్లబ్లో చేరాయి కూడా.అయితే ఈ రెండు సినిమాలు 20 రోజుల తేడాతో రావడంతో అసలు సమస్య మొదలైంది. మార్చి 30న వచ్చిన రంగస్థలం రాంచరణ్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సకుమార్ దర్శకత్వం వహించాడు.రాంచరణ్ సరసన సమంత హీరోయిన్ చేసింది. 1980లో జరిగే విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది.
సరిగ్గా రంగస్థలం సినిమా వచ్చిన 20 రోజులకి మహేష్ బాబు నటించిన భరత్ అను నేను సినిమా థియోటర్లలో సందడి చేశాడు.రెండు భారీ ప్లాప్ల తరువాత వస్తున్న సినిమా కావడం పైగా శ్రీమంతుడు లాంటి కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.సినిమాలో మహేష్ సీఎంగా నటించాడు. సినిమా మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.మహేష్ నటనకు అందరు ఫిదా అయ్యారు.సినిమా రెండు రోజులలోనే 100 కోట్ల మార్కెట్ అందుకుంది.అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది.మా సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందని రాంచరణ్ ఫ్యాన్స్,లేదు మా సినిమానే ఎక్కువ కలెక్ట్ చేసిందని మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేధికగా కొట్టుకుంటున్నారు.
ఈ విషయం రాంచరణ్కు తెలిసి ఈ విధాంగా స్పందించారు.మహేష్ బాబు నేను మంచి ఫ్రెండ్స్ .మా రెండు సినిమాలు బాగా ఆడాయి.ఇద్దరం సక్సెస్ కొట్టిన ఆనందంలో ఉన్నాము.మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మీరు అనవసరంగా గొడవలు పెట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకొవద్దు అని ఫ్యాన్స్కు హితవు పలికారు.మేమంతా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం. కలిసికట్టుగానే పనిచేస్తాం. మా సినిమాల ద్వారా లాభాలొస్తే అది పరిశ్రమ బాగుకే ఉపయోగపడుతుంది’ అని చరణ్ వివరణ ఇచ్చారు.మహేష్ బాబు కూడా భరత్ అను నేను సినిమా ఆడియో ఈవెంట్లో మేము మేము బాగుంటాం మీరే బాగుపడాలి అని ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడారు.మరి ఇంత వివరణ ఇచ్చిన తరవాత అయినా మహేశ్, చరణ్ ఫ్యాన్స్ శాంతిస్తారో లేదో చూడాలి.