మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటితో ఓ సినిమా చేస్తున్నాడు.రంగస్థలం వంటి హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడం,పైగా కమర్షియల్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది.దసరా కానుకగా సినిమా టీజర్ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది.
టీజర్ కాకపోయిన సినిమా టైటిల్ను ఎనౌన్స్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.ఇక సినిమాకు వినయ విధేయ రామ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు యాక్షన్కు పెద్ద పీట వేస్తు సినిమాను తెరకెక్కిస్తున్నాడట బోయపాటి.ఈ సినిమాలో రామ్ చరణ్కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=RSW99Ot9W9U