Thursday, May 2, 2024
- Advertisement -

కోపంతో రగిలిపోయిన చరణ్….. నిర్మాతలపైన అరిచేశాడా?

- Advertisement -

వరుసగా రెండు భారీ సినిమాలు చేయడానికి రామ్ చరణ్ కమిట్ అయ్యాడంటే ఆ నిర్మాత చరణ్‌ని ఏ రేంజ్‌లో చూసుకోవాలి? మరి అదే నిర్మాత చరణ్‌ని చూసుకునే విషయం పక్కనపెడితే చరణ్‌ని మోసం చేసే ప్రయత్నం చేస్తే? తాను ఎంతో కష్టపడి చేసిన సినిమాకు అన్యాయం చేస్తే…. చరణ్ స్థానంలో ఏ హీరో ఉన్నా ఇలానే అరిచేసి ఉండేవాడేమో. ఇప్పుడు చరణ్ కూడా అదే చేశాడు. నిర్మాత దానయ్యపై విరుచుకుపడ్డాడు. ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అసలు విషయం ఏంటంటే దానయ్యతో వరుసగా రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు చరణ్. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో పాటు ఆ తర్వాత రాజమౌళితో చేస్తున్న సినిమా కూడా దానయ్య బేనర్‌లోనే తెరకెక్కనుంది. అయినప్పటికీ దానయ్య మాత్రం రామ్ చరణ్ ఎంతో కష్టపడి నటించిన రంగస్థలం సినిమా జెన్యూన్‌గానే భారీ కలెక్షన్స్ సాధించింది. బాహుబలి-2 తర్వాత స్థానాన్ని సాధించింది. అయితే రంగస్థలం తర్వాత రిలీజ్ అయిన భరత్ అనే నేను సినిమాను నిర్మించిన దానయ్యతో మైత్రీ మూవీ మేకర్స్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆ సంబంధాలను ఉపయోగించుకుని భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయ్యాక రంగస్థలం సినిమా ప్రమోషన్స్ మరీ ఎక్కువ లేకుండా చేశాడట దానయ్య. పైగా చాలా ఏరియాల్లో బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కి నష్టాలు తెచ్చిన భరత్ అనే నేను సినిమా మాత్రం రంగస్థలాన్ని బీట్ చేసిందని……బాహుబలి-2ని కూడా బీట్ చేయబోతోంది అనే రేంజ్‌లో ఫాల్స్ పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయమే రామ్ చరణ్‌కి కోపం తెప్పించిందని తెలుస్తోంది. రంగస్థలం పబ్లిసిటీ యాక్టివిటీస్ తగ్గిపోయేలా చేయడం……రంగస్థలం కంటే భరత్ అనే నేను సినిమా చాలా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోందని ప్రచారం చేయడంపై నిర్మాత దానయ్యపై రామ్ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -