- Advertisement -
అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 4న విడుదలకు రెడీ అవుతుంది. వక్కంతం వంశీని ఈ సినిమతో దర్శకుడిగా పరిచియం చేస్తున్నాడు బన్నీ.అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా కనిపిస్తుంది.ఆదివారం ఈ చిత్ర ఆడియో లాంచ్ వేడుక మిలిటరీ మాధవరంలో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఏప్రిల్ 29న సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.ఈ వేడుకకు మెగా పవర్స్టార్ రామ్చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు చిత్రవర్గాలు అంటున్నాయి.ఇందులో అర్జున్ సైనికుడి పాత్రలో కన్పించనున్నారు. ఈ సినిమాకు లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.