- Advertisement -
లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రా ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకు ఆటంకాలు ఎదరవుతున్నాయి. ఈ సినమాను రిలీజ్ కాకుండా టీడీపీ వర్గాలు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వర్మ ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. నన్ను చంపినా సినిమా రిలీజ్ ఆగదని గతంలో ప్రకటించారు. తాజాగా ఆడియో రిలీజ్ ను కడపలో విడుదల చేస్తామని ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘‘వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్’’గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఆడియో రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వర్మ అన్నారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.