బాహుబలి సినిమాలో ప్రభాస్ పాత్ర కన్నాశివగామి పాత్ర సినిమాకు హైలెట్గా నిలిచింది. శివగామి పాత్రకు రమ్యకృష్ణ జీవం పోశారు. ఆమె హావభావాలు నటనతో సినిమాకు నిండుతనం.. రాణిగా హుందాతనం… అత్తగా పెత్తందారీతనం అన్నీ కలగలిసి సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లింది. బాహుబలి సినిమా అద్భుత విజయంలో శివగామి లేనిది ఊహించుకోలేం. అంటే రమకృష్ణ నటనకు అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అలాంటి ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో న్యాయం జరగలేదు. అయితేనేమీ సీఎన్ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2017 అవార్డు రమ్యకృష్ణకు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రమ్యకృష్ణ, యార్లగడ్డ శోభు అవార్డును అందుకున్నారు.
భారత క్రికెట్ జట్టు పరుగుల వీరుడు, జట్టు రథసారథి విరాట్ కోహ్లీ సందడి చేశాడు. రమ్యకృష్ణతో కలిసి ఫొటో దిగాడు. బాహుబలిలో శివగామి పాత్ర గురించి రమ్యకృష్ణతో ముచ్చటించారు. ఈ విషయాన్ని రమ్యకృష్ణ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “ఇప్పటివరకు నేను కలిసిని మంచి వ్యక్తులలో విరాట్ ఒకరు. ఆయన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది“ అని ట్వీట్ చేసింది. ఈ అవార్డుల కార్యక్రమానికి లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ప్రస్తుతం రమ్యకృష్ణ అఖిల్ సినిమా ‘హలో’, సూర్య సినిమా ‘గ్యాంగ్’లలో నటిస్తోంది.