Monday, April 29, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లం ఇంకా అయిపోలే ఉంది..

- Advertisement -

రీషూట్‌, ఐటెం పాట ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్‌

ఎప్పుడు విడుద‌ల చేయాల‌నుకున్నారు. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించారు. ఇంకెప్పుడు విడుద‌ల చేస్తారు. ఇది సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా ‘రంగ‌స్థలం’. ఈ సినిమా గ‌తేడాది ద‌స‌రాకు విడుద‌ల కావాల‌ని ఈ సినిమా తొలుత నిర్ణ‌యించారు. ఆ త‌ర్వాత సంక్రాంతి అన్నారు. కానీ విడుద‌ల కాలేదు. ఇప్పుడు వేస‌వి అంటున్నారు. కానీ అప్పుడు కూడా విడుద‌ల‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదంట‌. దీనికి తోడు పూజా హెగ్డేతో ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారు. ఆ పాట ఈ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్స‌య్యే అవ‌కాశం ఉందంట‌.

అయితే ఈ సినిమాకు మ‌రో క‌ష్టం వ‌చ్చి ప‌డింది. సుకుమార్ కొంతభాగం రీ షూట్ చేయాలని నిర్ణ‌యించాడు. క్వాలిటీ కోసం రాజీ పడకుండా రామ్‌చరణ్ కూడా అదనంగా డేట్స్ ఇచ్చేశాడు. దీంతో ఈ సినిమా మ‌ళ్లీ రీ షూట్ జ‌రుపుకుంటోంది. అయితే రీ షూట్‌కు కారణం తెలియ‌డం లేదు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10 వరకు జరిగే సింగిల్ షెడ్యూల్‌లో పాటతో సహా మొత్తం షూటింగ్ పూర్తయిపోతుంది.

ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా, జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత గ్యాప్ లేకుండా రామ్‌చరణ్ బోయపాటి శీను సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -