గ్రామీణ నేపథ్యంలో దివ్యాంగులుగా హీరో, హీరోయిన్లు నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్చరణ్ చిట్టిబాబుగా, సమంత రామలక్ష్మిగా కనిపిస్తున్నారు. ఈ సినిమా టీజర్లు, పాటలు సూపర్హిట్గా నిలుస్తున్నాయి. ఈ సినిమాను మార్చి 30వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ విశాఖపట్టణంలో మార్చి 18వ తేదీన నిర్వహించనున్నారు.
అయితే ఈ వేడుకకు రామ్చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, మరో దర్శకుడు బోయపాటి శ్రీను హాజరుకానున్నారు. ఈ స్టార్ త్రయం రంగస్థలం సినిమా ప్రచారంలో పాల్గొననుండడంతో ప్రీ రిలీజ్ వేడుకకు భారీ స్పందన వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. మరీ ప్రేక్షక, అభిమానులు సినిమా చూడడానికి సిద్ధంగా ఉండండి.