Thursday, May 16, 2024
- Advertisement -

టీవి యాంక‌ర్‌పై అత్యాచారం

- Advertisement -

హైద‌రాబాద్ సిటీలో ఓ టీవి ఛానెల్లో ప‌ని చేస్తున్న యాంక‌ర్‌పై అత్యాచార ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది.ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలం మానేపల్లికి చెందిన శ్రీశాంత్‌రెడ్డి నగరంలోని ఇందిరానగర్‌కు వలసొచ్చి, సినీ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇత‌నికి ఓ మహిళా యాంకర్ ప‌రిచియ‌మైంది. దీంతో సినిమాల‌లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి త‌న‌ను న‌మ్మించి వెంట తీసుకెళ్లాడు.ఆమెకు మ‌త్తు మందు ఇచ్చి ,అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగలేదు.

ఆమె ఇంట్లోంచి 40 తులాల బంగారు అభరణాలు, రూ.5 లక్షల నగదు కాజేశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె ఇదేమిట‌ని ప్ర‌శ్నిస్తే పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి కొంత‌కాలం గడిపాడు.కాని అత‌నివైపు నుండి ఎటువంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డానికి రెఢీ అయింది. శ్రీశాంత్‌రెడ్డి కూడా స‌ద‌రు యాంక‌ర్‌పై కేసు పెట్టాడానికి రెఢీ అయిన‌ట్లు స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -