బుల్లితెర యాంకర్, హీరో ప్రదీప్ ఇంట విషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండు రంగ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు (ఆదివారం) తెల్లవారు జామున మరణించారు. ఆయన కరోనా కారణంగా మరణించారనే వార్తలు వస్తున్నప్పటికీ దానిపై అధికారిక సమాచారం లేదు.
ఆ సినిమాల లిస్టులోకి చేరిపోయిన నాగ చైతన్య.. థాంక్యూ!
బుల్లితెరపై యాంకర్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రదీప్.. ఇటీవల హీరోగా కూడా మారాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా భేష్ అనిపించుకుంది. ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్పై ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది.
త్రివిక్రమ్-మహేష్ ముచ్చటగా మూడో సినిమా .. హిట్ పక్కా!
టాలీవుడ్ ప్రముఖులు, ఇతరులు అతని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. అయితే ప్రదీప్ తండ్రి కోవిడ్ వల్ల చనిపోయారా లేదంటే ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారన్నది కూడా తెలియాల్సి ఉంది.