- Advertisement -
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందుతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఉగాది సందర్భంగా షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాలో నాని పక్కన నటించే హీరోయిన్ ఎంపికయ్యింది.
తెలుగులో తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్ రష్మిక మందన. ఛలో సినిమాలో నాగశౌర్య పక్కన మెప్పించిన హీరోయిన్ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పక్కన ఓ సినిమా చేస్తుండగా ప్రస్తుతం నాగ్, నాని మల్టీస్టారర్లో ఈ సినిమాలో నటించడానికి ఒప్పేసుకుందని సమాచారం.