Saturday, April 27, 2024
- Advertisement -

అఫిషియల్‌..సుకుమార్‌తో రామ్‌చరణ్‌

- Advertisement -

రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప 2 సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా తర్వాత మళ్లీ రామ్ చరణ్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ అఫిషియల్ ప్రకటన చేసింది. ఇక రామ్ చరణ్‌కు ఇది 17వ సినిమా.

ఈ ఏడాదిలోనే షూటింగ్ మొద‌లుకానుండగా 2025 సంవత్సరం చివరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌కి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ తోడవడం అభిమానుల్లో మరింత జోష్ నింపింది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ తెరకెక్కుతోంది. త్వరలోనే రిలీజ్ కానుండగా తర్వాత తన 16వ సినిమాను ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో చేయనున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్‌తో సినిమాలో నటించనున్నారు చెర్రీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -