పవన్ కల్యాణ్ సరసన కథానాయికగా ‘బద్రి’ .. ‘జానీ’ సినిమాలు చేసిన రేణు దేశాయ్, గత కొన్నేళ్లుగా సినిమాలకి దూరంగా వున్నారు. త్వరలో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. పవన్ నుంచి విడిపోయిన రేణు దేశాయ్ .. ఆ తరువాత పిల్లల ఆలనా పాలనపైనే దృష్టి పెట్టారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
పవన్తో విడాకులు తీసుకున్న తర్వాత రేణుదేశాయ్ పవన్పై చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు భగ్రుమన్నారు. పవన్ అభిమానులు, రేణూ మధ్య సోషియల్ మీడియా వేదికగా ఓ పెద్ద యుద్ధమే జరిగిందనే చెప్పాలి.
ఇక ఇటీవలే ఆమెకి మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది.ఈ విషయాన్ని సోషియల్ మీడియా ద్వారా వెల్లడించింది. వాహం తరువాత రేణుదేశాయ్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై రేణూ దేశాయ్ నుంచి క్లారిటీ రావాల్సిఉంది.