Thursday, April 25, 2024
- Advertisement -

సై రా సినిమా రైటర్ పైన రిస్ట్రిక్షన్స్?

- Advertisement -

మరొక నెల రోజుల్లో ప్రతిష్టాత్మక చిత్రం సై రా నరసింహ రెడ్డి విడుదల కానుంది. ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ప్రస్తుతం జోరు గా సాగుతున్నాయి కానీ ఫుల్ గా మాత్రం ఇంకా మొదలు కాలేదు. మరి కొన్ని రోజుల్లో చిరంజీవి ముంబై వెళ్ళి అక్కడ మీడియా తో మాట్లాడదాం అని అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా మీద బజ్ ని పెంచుతూ పోవాలి అని సినిమా కి సంబందించిన మార్కెటింగ్ టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా కి సంబందించిన సాంకేతిక నిపుణుల యొక్క ఇంటర్వూస్ ని ప్లాన్ చేస్తున్న ఫిలిం యూనిట్ ఆ సినిమా రైటర్ సాయి మాధవ్ బుర్రా విషయం లో కాస్త అసంతృప్తి తో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఇటీవలే యూట్యూబ్ లో కొన్ని ఛానెల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ ఒక డైలాగ్ ని చెప్పేసారు. ఆ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.

ఇలాంటివి ప్రమాదం అని, బజ్ ని తగ్గించేలా గా కూడా ఉపయోగపడతాయి అని అభిప్రాయం పడిన సినిమా నిర్మాత సినిమా విడుదల అయ్యే వరకు తాము చెప్పిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇంటర్వూస్ ఇవ్వకండి అని కోరినట్లు సమాచారం. మరి ఈ రిస్ట్రక్షన్ ని ఆయన ఎలా తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -