- Advertisement -
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ..శ్రీదేవికి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు బహిరంగంగానే శ్రీదేవిపై ప్రశంసలు గుప్పించారు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించానని చెప్పారు కూడా. శ్రీదేవితో ఆర్జీవీ రెండు సినిమాలు చేయగా రెండు బ్లాక్ బాస్టర్ హిట్లే.
తాజాగా శ్రీదేవికి సంబంధించిన ఓ న్యూస్ని షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో తయారుచేసిన ఓ శ్రీదేవి ఫోటోని షేర్ చేసి.. ఆ ఆర్టిఫిషియాల్ ఇంటిలిజెన్స్ శ్రీదేవి నన్ను ఏడ్చేలా చేసింది ఎమోషన్ అయ్యాడు. అయితే ఈ ఫొటోలో శ్రీదేవి చాలా అందంగా ఉండటంతో శ్రీదేవి గుర్తొచ్చి ఏడ్చా అనే అర్ధం వచ్చేలా పోస్ట్ చేశారు ఆర్జీవీ.
ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారగా ఆర్జీవీ కూడా ఏడుస్తాడా? అని ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు. మొత్తంగా ఆర్జీవీ ఏం ట్వీట్ చేసినా అది సంచలనమే.